ఆదర్శంగా.. వ్యాపార కేంద్రంగా.. అభివృద్ధిలో అగ్రగామిగా..
రైలు రాకతో మారనున్న దశ
ఇక్కడి నుంచే ప్రధాన పట్టణాలకు రాకపోకలు
గజ్వేల్ చుట్టూ పూర్తి కావస్తున్న రింగ్రోడ్డు
పట్టణం పక్కనుంచే రీజినల్ రింగ్ రోడ్డు
అందుబాటులోకి వచ్చిన భారీ ప్రాజెక్టులు
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్ ప్రధాన పట్టణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. అన్నిరంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నది. హైదరాబాద్కు అతిసమీపంలో ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారుతున్నది. త్వరలోనే రైలు కూత వినిపించనుండగా, ఇక్కడి నుంచే ప్రధాన నగరాలకు రైలు వెళ్లనున్నది. ఎడ్యుకేషన్ హబ్, మహతి ఆడిటోరియం, వెజ్, నాన్వెజ్ మార్కెట్, పట్టణ సుందరీకరణ తదితర పనులు పట్టణానికి మణిహారంగా మారగా, త్వరలోనే క్రీడా విజేల్ ఏర్పాటు కానుండడంతో జాతీయస్థాయి క్రీడలకు వేదిక కానున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్తో పర్యాటక కేంద్రంగా మారగా, సాగు, తాగునీటి సమస్య లేకుండాపోయింది. నీటి వసతులు అధికంగా ఉండడం పరిశ్రమలకు కలిసోస్తుంది. జిల్లాలో రెండు ప్రాజెక్టులను టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు సమాయత్తమవుతుండడంతో ఇక్కడి ప్రాంతంపైనే వ్యాపారులు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
గజ్వేల్ రూరల్, మే 23: గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ పోటీ చేయడం ఆయన నాయకత్వంలో ప్రభు త్వం అధికారంలోకి రావడంతోనే మహర్దశ వచ్చింది. మహా నగరానికి అతి దగ్గర్లో ఉన్న గజ్వేల్ నియోజ కవర్గం మాత్రం ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందనే చెప్పొచ్చు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మొదటిసారి ప్రభుత్వం ఏర్పాడడంతో గజ్వేల్ అభివృ ద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో నేడు రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. గజ్వేల్ పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధిలో అగ్రగా మిగా నిలవడంతో నేడు హైదరాబాద్కు అతిసమీపంలో ఉండడంతో వ్యాపార కేంద్రంగా మారుతున్నది.
గజ్వేల్లో విద్య, వైద్య సదుపాయాలు, కొండపోచ మ్మ ప్రాజెక్టు, పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు, అతి త్వర లోనే రైలు అందుబాటులోకి రానుండడంతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) కూడా గజ్వేల్ సమీ పంలోనే నుంచే వెళ్తున్నది. హైదరాబాద్కు అతి సమీ పంలోనే గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగా మిగా నిలవడంతో వ్యాపారులు ఇక్కడి నుండే పెట్టుబ డులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. గజ్వేల్ నుంచి తూప్రాన్ వెళ్లే మార్గంలో రింగ్ రోడ్డు పక్కనే అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ నిర్మా ణానికి ప్రభుత్వం రూ.7.50 కోట్లను విడుదల చేయ డంతో పనులు చకచకా సాగుతున్నాయి. ఇదే మార్గం లో కిలోమీటర్ దూరంలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తికావడంతో సంబంధిత అధికారులు రైలును త్వర లోనే నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే ప్రధాన పట్టణాలైన ఢిల్లీ, బెంగళూర్, తిరుపతి, చైన్నైకి రైలు నడిపేందుకు ప్రణాళికను రూపొందించడంతో ఇక్కడ మరిన్ని ట్రాక్ల నిర్మాణం చేపడుతున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో..
గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్, మక్తమాసా న్పల్లి, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, మూట్రా జ్పల్లి, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి గ్రామాల మీదుగా ట్రిపుల్ఆర్ వెళ్తున్నది. ఈ నిర్మాణం పూర్తయితే భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. గజ్వేల్ సమీపంలోనే ప్రధాన ప్రాజెక్టులైన కొండపోచమ్మ రిజర్వాయర్ ఉండడంతో నీటి వసతులు అధికంగా ఉండడం పరిశ్రమలకు కలి సోస్తున్నది. రెండు ప్రాజెక్టులను టూరిజం శాఖ ఆధ్వ ర్యంలో అభివృద్ధి చేసేందుకు సమాయత్తం అవుతుం డడంతో ఇక్కడి ప్రాంతంపైనే వ్యాపారులు సుము ఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
రైలురాకతో మారనున్న దశ..
గజ్వేల్కు రైలు రాకతో దశ మారనున్నది. ఎన్నో ఏండ్లగా వేచి చూసిన పట్టణవాసుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారు. మొదట మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ వరకు రైలును నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ, హైదరాబాద్ను అతి సమీపంలోనే ఉండడంతో గజ్వేల్ నుంచే ప్రధాన రైళ్లను నడిపేందుకు సుముఖం గా ఉన్నారు. ట్రాక్ల నిర్మాణం గజ్వేల్లో చేపడుతున్నా రు. ఇక రైతులకు ఎప్పుడు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడి నుంచే చుట్టూ జిల్లాలకు సరఫరా చేసేందుకు గోదాం నిర్మాణం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీంతో గజ్వేల్ కేంద్రంగా వ్యాపారం అధికంగా జరగనున్నది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఒక్క రైలు రాకతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి
గజ్వేల్కు దగ్గర్లోనే కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ట్రీబుల్ ఆర్తో ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు అధికంగా దొరుకుతాయి. ఇప్పటికే రాజీవ్ రాహదారికి సమీపంలో వర్గల్ వద్ద భారీ పరిశ్రమలను స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సీఎం కేసీఆర్ అనుకున్నది త్వరలోనే చేసి చూపిస్తారన్నారు.
– వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
సీఎం కేసీఆర్తో అన్నిసాధ్యం అయ్యాయి
సీఎం కేసీఆర్తో అన్ని సాధ్యం అయ్యాయి. గజ్వేల్కు ప్రత్యేకత వచ్చిందంటే కేసీఆర్ కృఫి ఫలితమే. రాష్ట్రంలోనే అభివృద్దిలో గజ్వేల్ అన్ని రంగాల్లో ముందుంది. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్దిని కేసీఆర్ సహకారంతో చేసుకొగలిగాం. రాబోయే రోజుల్లో వ్యాపారపరంగా గజ్వేల్కు మంచి భవిష్యత్ ఉంటుంది. గజ్వేల్ చుట్టూ రింగ్రోడ్డు, రైల్రాకతో వాణిజ్య హబ్గా మారనుంది.
– మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన
గజ్వేల్కు రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాంతంలో విరివిగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే వర్గల్, ములుగు, వంటిమామిడి ప్రాంతాల్లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సేకరించిన ప్రదేశాల్లో పరిశ్రమలను స్థాపించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. మర్కూక్ మండలం కర్కపట్లలో అధికంగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పరిశ్రమలు గజ్వేల్ ప్రాంతలోనే ఏర్పాటు అవుతాయి. సీఎం కేసీఆర్ గజ్వేల్పై ప్రత్యేక చోరవ తీసుకొవడంతో గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందింది.
– ముత్యంరెడ్డి, గడా ప్రత్యేకాధికారి
యువతకు ఉపాధి అవకాశాలు
గజ్వేల్ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఏర్పాటయ్యే పరిశ్ర మలతో యువతకు ఉపాధి అవకాశాలు అధి కంగా దొరుకుతాయి. గజ్వేల్కు రవాణా సౌకర్యంతో పాటు నీటి వసతి కూడా ఉండండతో ఈ ప్రాంతంలోనే పరిశ్రమలు నెలకొల్పేందుకు వ్యాపారులు ముందుకొస్తారు. గజ్వేల్ చుట్టూ రింగ్రోడ్డు, రైల్వేలైన్ ఏర్పాటు కావడం ఎంతగానో కలిసొచ్చింది. సీఎం కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధిపై చెరగని ముద్ర వేయడంతో నేడు అందరి చూపు గజ్వేల్ వైపు ఉన్నది. త్వరలోనే గజ్వేల్ యువతకు మంచి
రోజులు వస్తాయి.
– రాజమౌళి, మున్సిపల్ చైర్మన్, గజ్వేల్
సీఎం కేసీఆర్తోనే గజ్వేల్ అభివృద్ధి
సీఎం కేసీఆర్తోనే నేడు గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. వ్యాపారులకు గజ్వేల్ ప్రాంతం పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన ప్రాంతం. ప్రాజెక్టుల నిర్మాణంతో నీటి వసతులు అధికంగా ఉన్నాయి. ఒక విధంగా పరిశ్రమలకు నీటి వసతి ఎంతగానో అవసరం అందుకు ఈ ప్రాంతలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తే వేలాది
మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
– ఉడేం కృష్టారెడ్డి, పట్టణవాసి, గజ్వేల్