పటాన్చెరు, అక్టోబర్ 30: పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో క్షత్రియ రాజ్పుత్ సమాజ్, పెరిక సంఘం, చర్చి పాస్టర్ల సంఘం, వడ్డెర సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హాజరయ్యారు. పలు సంఘాల ప్రతినిధులు ఆయనకు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిపాల్రెడ్డి విజయానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్న సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, అంజిబాబు, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు రాజన్సింగ్, సత్తిబాబు, లింగయ్య, ప్రశాంత్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బండ్లగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి విజయానికి సంపూర్ణ మద్దతు అందజేస్తామని పటాన్చెరు డివిజన్ బండ్లగూడ ఎస్సీ కాలనీవాసులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. సోమవారం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపాల్, శేఖర్, డప్పుమల్లేశ్, జీతయ్య, లక్ష్మణ్, సురేశ్, కృష్ణ , అస్మా, యాదమ్మ, చంద్రమ్మ, ఊర్మిల తదితరులు పాల్గొన్నారు.