సిద్దిపేట రూరల్, మే 3: మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాఘవాపూర్లో ఇప్పటివరకు ఉన్న లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతెన నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.
ముస్తాబాద్-మాచారెడ్డి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.30 కోట్లు నిధులు మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవీరాంచందర్రావు, సర్పంచ్ ఎర్వ రమేశ్, బీఆర్ఎస్ రాఘవాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్యార తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.