రామచంద్రాపురం, మే1: అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని శాసనమండలి ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరిపారు. ఓల్డ్ ఆర్సీపురం, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, లక్ష్మీగార్డెన్స్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రజలు భూపాల్రెడ్డితో కేక్కట్ చేయించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తనపైన చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదని, నలభై ఏండ్లుగా రాజకీయంలో ఉండి ప్రజా సేవ చేస్తున్నానని, ఎప్పుడు కూడా ఎలాంటి అవినీతి మచ్చ పడలేదన్నారు. తన రాజకీయ జీవితంలో వేలాది మంది అభిమానులను సంపాదించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
జీవితంలో చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటానని ఉద్ఘాటించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లోనే భూపాలన్నకు రాజకీయ భీష్ముడని పేరుందని తెలిపారు. నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. సొంత ఖర్చుతో జూనియర్ కళాశాలను నిర్మించి వేలమంది విద్యార్థులకు ఆయన విద్యాదాతగా నిలిచారన్నారు. భూపాల్రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇదేవిధంగా నిండు నూరేండ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన భూపాల్రెడ్డి
రామచంద్రాపురం, మే 1: ప్రొటెం మాజీ చైర్మన్ వి.భూపాల్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఆయన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డికి మంత్రి హరీశ్రావు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.