బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకే సీఎం కేసీఆర్ ‘బీసీబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్లో నియోజకవర్గంలోని 300 మంది లబ్ధిదారులకు బీసీబంధు చెక్కులను కలెక్టర్ రాజర్షిషాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అభివృద్ధిలో నెంబర్వన్గా నిలిచామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష సాయంతో కులవృత్తుల యూనిట్లను స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
-మెదక్ (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 1
మెదక్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు మూడో విడత బీసీ బంధు చెకులను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనిసంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తూ సీఎం కేసీఆర్ మన రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు.
రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధులాంటి ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతలుగా బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశామని, బీసీలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో మూడో విడత బీసీబంధు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కులవృత్తుల బలోపేతానికి బీసీబంధు..
నిరుపేద వర్గాలకు చెందిన కుల వృత్తుల ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బీసీబంధు పథకం ప్రవేశపెట్టిందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పథకం ద్వారా అధునాతన పరికరాల కొనుగోలుకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. జిల్లా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో మూడో విడత పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
– మెదక్ కలెక్టర్ రాజర్షి షా