శివ్వంపేట, జనవరి 1 : చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మాదరబోయిన ఆగేశ్ చేపలు పట్టేందుకు గ్రామచెరువుకు డిసెంబర్ 31న సాయంత్రం వెళ్లాడు.
తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు చెరువువద్దకు వెళ్లి చూడగా చెరువుకట్టపై స్కూ టర్, బట్టలు ఉన్నాయి. ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించారు. మాదరబోయిన ఆగేశ్ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. ఈ విషయమై మృతుడి కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.