తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నీలి విప్లవాన్ని సృష్టించి దేశంలోనే చేపల ఉత్పత్తిలో రికార్డు నెలకొల్పారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. శనివారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో ఆయన మాట్లాడారు. మత్స్య సంపద పెరగడంతో స్థానిక చెరువులపై తమకే హక్కులు కల్పించాలని స్థానిక మత్స్యకార సామాజిక వర్గాలు కోరుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో నాలుగేండ్లుగా పెండింగ్ ఉన్న మత్స్యకారుల ఇన్సూరెన్స్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు చొరవ తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనవాస్యాదవ్ను కోరారు.
– మెదక్, (నమస్తే తెలంగాణ) ఆగస్టు 5
మెదక్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో మత్సకారుల సమస్యలపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో చేపలు దొరకడం కష్టంగా ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో నీలి విప్లవాన్ని సృష్టించారన్నారు. ఎవరూ ఊహించని విధంగా చేపల ఉత్పత్తిలో రికార్డు సృష్టించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు. చేపలు పట్టే సామాజిక వర్గాలైన ముదిరాజ్లు, గంగపుత్రులకు గతంలో ఈ విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ఉండేవారని, సీఎం చొరవతో చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులపై ఇతర గ్రామాల వారు వచ్చి సొసైటీని ఏర్పాటు చేసుకుని హకులు పొందారన్నారు. ఇటువంటి గ్రామాల్లో స్థానిక మత్స్యకార సామాజిక వర్గం వారు తమ చెరువులపై తమకే హకులు కల్పించాలని కోరుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని స్థానికులకు అవకాశం కల్పించాలని మంత్రిని ఎమ్మెల్సీ కోరారు. దీంతో పాటు మత్స్యకారులకు సంబంధించి మరో సమస్యను కూడా సభలో ఎమ్మెల్సీ ప్రస్తావించారు.
గ్రామాల్లో చెరువులపై ఏర్పాటైన సొసైటీలో కొందరికే సభ్యత్వం ఇవ్వడంతో మత్స్యకారు సామాజిక వర్గంలోని మిగతా కుటుంబాలకు న్యాయం జరగడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు నాలుగు ఏండ్లుగా పెండింగ్లో ఉన్న మత్స్యకారుల ఇన్సూరెన్స్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిషరించాలని ఎమ్మెల్సీ కోరారు. చేప పిల్లలు, రొయ్య పిల్లల సీడ్ విషయంలో పక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాకుండా మన రాష్ట్రంలోనూ సీడ్ ఉత్పత్తిని పెంచాలని మంత్రికి సూచించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ప్రాంతాల వారీగా ఉత్పన్నమైన సమస్యలపై విడతల వారీగా పరిషరించుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. అందరికీ న్యాయం చేసేందుకు మత్స్యకార సంఘాల్లో కొత్తగా లక్ష మందికి సభ్యత్వం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇన్సూరెన్స్ విషయంలో కూడా వివరాలను పరిశీలించి సమస్యను పరిషరిస్తామని సభలో మంత్రి వివరించారు.