మెదక్ : జిల్లాలోని కొల్చారం మండలం రాంపూర్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident ) ముగ్గురు దుర్మరణం చెందారు. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్ టీ సీ బస్( RTC Bus ) ఢీ జాతీయ రహదారిపై ఢీ కొట్టింది.
దీంతో హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి కి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిశివర్ధన్ గౌడ్ (13), బొగడ భూపతి పూర్కు చెందిన సాయ గౌడ్ (32) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.