మెదక్ : మెదక్ జిల్లా చేగుంట, నార్సింగ్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కర్నాల్ పల్లి మక్కరాయపేట గ్రామాలలో రహదారిపై బైఠాయించి రైతులు నిరసనతెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ శివప్రసాద్ అక్కడికి చేరుకొని పంట నష్టంపై వ్యవసాయ అధికారులతో నివేదిక తెప్పించి తగు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఇవి కూడా చదవండి..
Rythu Bhima | రైతు బీమాకు మంగళం..పథకాన్ని నీరుగారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
Attapur | నిద్రిస్తున్న వ్యక్తిపై వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన దుండగుడు