చౌటకూర్, జనవరి 18: భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు ఆర్ఆర్ఆర్ ఏర్పాటుపై బుధవారం చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహిం చారు. పోలీసు ఆంక్షల మద్య సాగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) వీరారెడ్డి, డీఎస్పీ రవీందర్రెడ్డి పర్యవేక్షణలో నిరసనలు, ధర్నా లు, బహిష్కరణల మధ్య ముగిసింది. 65, 161వ నంబర్ జాతీయ రహదారి విస్తరణతో పాటు సింగూరు కాళేశ్వరం కాలువల ఏర్పాటు హైటెన్షన్ విద్యుత్ టవర్ల ఏర్పాటు వల్ల ఎకరాల కొద్ది పం ట భూములు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంశ పారపర్యంగా వస్తున్న అరకొర భూములను ఆర్ఆర్ఆర్లో కోల్పోవడంతో తాము బతికేదెలా అంటూ నిరసన వ్యక్తం చేశా రు.
ఆర్ఆర్ఆర్ను ఎట్టి పరిస్థితులోను ప్రారంభం కానివ్వమని, స్వాదీన పరుచుకునేందుకు వచ్చే వారిని అడ్డుకుంటామన్నారు. భూ బాధిత రైతులను సంఘటితం చేసి ఆర్ఆర్ఆర్కు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు. కాలేశ్వరం కాలువలో భూమిని కోల్పోయాం తాజాగా రహదారికి అవసరమైన భూమిని ఇవ్వాలం టూ నోటీసులు అందజేశారు. ఇంక తాము ఏమి సాగు చేసుకోవాలంటూ హత్నూర మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వీరేశంగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవులపల్లి మీదుగా ఉన్న రహదారిని హత్నూ ర మీదుగా అలైన్మెంట్ మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మంజీరా జలాశయం నిర్మాణంతో పట్టా భూ ములు కోల్పోతే, కల్పగూరు గ్రామ శివారులో ప్రభుత్వ భూమిని కేటాయించిందని, తాజాగా ఆ భూమి కూడా ఆర్ఆర్ఆర్కు సేకరించారని ఎలా బతకాలంటూ సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామానికి చెందిన డప్పు లక్ష్మయ్య విచారం వ్యక్తం చేశారు.
పట్టా భూములు కో ల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా మరో చోట ప్ర భుత్వ భూములు ఉంటే వాటిని కేటాయించి ఇంటికో ఉద్యోగం శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ చింతపల్లి గ్రామానికి చెందిన గూడు అనంతయ్య కోరా రు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చే సిబ్బందిని అడ్డుకొని తీరుతామని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన కుమ్మరి రాంచందర్, అవుసలి ఆంజనేయులు పేర్కొన్నా రు. న్యాయంగా మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రభు త్వం పెద్ద మనుసుతో పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు.