నారాయణరావుపేట, ఆగస్టు 6 : మం డలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో సుస్థిర వ్యవసాయం, చిరుధాన్యాలు, సేంద్రియ వ్యవసాయంపై నేడు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సదస్సుకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మం త్రి తన్నీరు హరీశ్రావు, ప్రముఖ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రకృతి ప్రేమికుడు ఖాదర్ వలీ, ప్రముఖ రిటైర్డ్ ఇంజినీర్ అసోసియేషన్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్రెడ్డి హాజరు కానున్నారు.
కొర్రలు, అరికెలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. నిత్యం ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు రైతులను సన్నద్ధం చేయనున్నారు. ఇబ్రహీంపూర్లో కంది, వరి, పెసర విత్తనోత్పత్తి ఏ విధంగా సాగు చేస్తున్నారు వంటి అంశాలపై నిపుణులు పరిశీలిస్తారు. గ్రామంలో పండిస్తున్న వివిధ రకాల విత్తనాలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్, సీడ్ బ్యాంక్ స్టాల్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా సుస్థిర వ్యవసాయం వైపు తమను తీసుకెళ్తున్నందుకు రైతులు మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటాం
మా గ్రామాన్ని దత్తత తీసుకుని వ్యవసాయం చేసుకునేందుకు అనేక రకాలుగా అవకాశం కల్పిస్తున్న మంత్రి హరీశ్రావు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. సుస్థిర, సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయాన్ని ఆదరిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు మరిచిపోం.
– కుంభాల మల్లికార్జున్రెడ్డి, రైతు, ఇబ్రహీంపూర్