కొల్చారం : మెదక్ జిల్లాలో విషాదం చోట చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన రైతు కురుమ పోచయ్య (50) సోమవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. ఉదయం తుకానికి నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లగా తుకం మడి పక్కన ఉన్న సర్వీస్ వైరు తగలడంతో షాక్ కు గురై మరణించాడు. పోచయ్య మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.