మెదక్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 40 బృం దాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డాక్టర్తో పాటు అప్తాలమిజిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్లు పని చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 68,124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 32,979 మంది కాగా, మహిళలు 35,145 మంది ఉన్నారు. 9647మందికి కంటి అద్దాలను అందజేశారు. మరో 8907 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇదిలావుండగా మంగళవారం 6805మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 3149 మంది కాగా, మహిళలు 3656మంది ఉన్నారు. 629మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, 594 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చామని డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డిలో 16,984 మందికి కంటి పరీక్షలు
సంగారెడ్డి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో కంటివెలుగు కొనసాగుతుంది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో 69 కంటివైద్య శిబిరాలు నిర్వహించారు. కంటివైద్య శిబిరాల్లో 16,984 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 8258మంది పురుషులు, 8726మంది మహిళలు ఉన్నారు. గ్రామాలకు చెంది న 11696మంది, మున్సిపాలిటీల్లోని 3797 మంది, జీహెచ్ఎంసీ పరిధిలోని 1491మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 1507 మందికి కంటి అద్దాలు అందజేశారు. 781 మంది పురుషులు, 726 మంది మహిళలు కళ్ల అద్దాలు తీసుకున్నారు. 1754 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. 893మంది పురుషులు, 861 మంది మహిళలకు కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా సూచించారు.