చిలిపిచెడ్/ చిన్నశంకరంపేట, ఏప్రిల్ 28 : కంటి వెలుగు శిబిరానలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలకేంద్రంతోపాటు అంతారం గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను పరిశీలించారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ భాగ్యలక్ష్మి పరిశీలించారు. ఎంపీపీ వెంట సర్పంచ్ మంగాదేవి, డాక్టర్ సాయిసింధు, నేతలు యాదవరావు, గోపాల్రెడ్డి, వడ్ల శ్రీనివాస్ ఉన్నారు.