నారాయణఖేడ్, మార్చి 6: ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణఖేడ్లో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి ఉచితంగా ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఓట్లు దండుకుని ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన రేవంత్రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తిరిగి ఎల్ఆర్ఎస్ను అమలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు ఎం.ఏ.నజీబ్, పార్శెట్టి సంగప్ప, ప్రభాకర్, రవీందర్నాయక్, సిద్ధయ్యస్వామి, అంబాదాస్, శేఖర్, లయక్, గోపాల్, రాజు, దత్తు, సాల్మన్ పాల్గొన్నారు.