సంగారెడ్డి, డిసెంబరు 14: సమాజంలో ప్రజలకు పోలీసు యంత్రాంగంపై ఉన్న అపోహలను తొలగించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసులపై ఉందని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని ఓ ఫంక్షన్హాలులో సంగారెడ్డి, జహీరాబాద్ సబ్ డివిజన్ల దర్బార్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు.
పోలీస్శాఖలో సమస్యలతో ఇబ్బదులు పడుతున్న పోలీసుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి, రివార్డులు, పతకాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు ఎస్పీ అశోక్, జహీరాబాద్ డీఎస్పీ రఘు, సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్, సూపరింటెండెంట్స్ వెంకటేశం, అశోక్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ విజయ్కృష్ణ, జహీరాబాద్, సంగారెడ్డి సబ్ డివిజన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.