గజ్వేల్, మార్చి 21: కరెంట్ 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి ఉచితంగా జీరో బిల్లు అందించి ఎలాంటి బిల్లులు వసూలు చేయమని రాష్ట్ర ప్రభు త్వం చెప్పింది. మార్చిలో చాలా మందికి జీరో కరెంట్ బిల్లులు రాకపోవడంతో వినియోగదారులు షాక్కు గురయ్యారు. గజ్వేల్ మున్సిపల్ అధికారులు ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫారాలను వంద శాతం ఆన్లైన్ చేయకపోవడంతో జీరో బిల్లులు రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కొద్దిరోజులుగా పట్టణానికి చెందిన వినియోగదారులు రోజూ వందల సంఖ్యలో మున్సిపల్ కార్యాలయంలో తిరిగి దరఖాస్తులు అందజేస్తున్నారు. త్వరగా ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు.