చౌటకూర్, సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెంది, వాటి రూపురేఖలు మారాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని శివంపేట, వెంకట కిష్టాపూర్, తడ్దాన్పల్లి గ్రామాల్లో వారు పర్యటించి, పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
గత పాలకుల తీరుతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు తెలంగాణ ప్రభుత్వంలో రూపురేఖలు మార్చుకున్నాయన్నారు. అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. శివంపేటలో వడ్డెర కాలనీలో రూ.35 లక్షలు, తడ్దాన్పల్లిలో రూ.20 లక్షలు, వెంకట కిష్టాపూర్లో రూ:35 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం చౌటకూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరారెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు.
దీంతో ఆయనను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పరమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్య, వైస్ ఎంపీపీ వీరేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుడు అలీం, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి, నాయకులు గోపాల్, రాములు, అశోక్, సంతోష్, రాజేందర్, చంద్రయ్య, ప్రభులింగంగౌడ్, అవంతి, మల్లేశం, దర్శన్రెడ్డి, మాణిక్రెడ్డి, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.