శివ్వంపేట, జూన్ 5: బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్యమాధవరెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్లతో కలసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పలువురు విధ్యార్థులను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ బడిబాట నిర్వహించి రోజువారీ నివేదికను అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కిషోర్కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుందరి, రాధా, వీణ, శైలజ, సీఆర్పీ ఆంజా ఉన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట, జూన్ 5: రామాయంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం సవిత ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు ఫీజు లేకుండా విద్య, యూనిఫారం, స్కాలర్షిప్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని, పిల్లలను బడిలో చేర్పించండని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాధిక, స్వరూపారాణి, రత్నశ్రీ, రిబికా, విజయ, మమత, సత్యవతి, లక్ష్మి, అంజయ్య, పద్మ, నాగరాణి ఉన్నారు.
పిల్లలను సర్కారు బడికి పంపండి
చిలిపిచెడ్, జూన్ 5: పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని చిలిపిచెడ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ కోరారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని వసతులు కలిగిన సర్కారు బడుల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
పెద్దశంకరంపేట, జూన్ 5: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని హెచ్ఎం రామచంద్రాచారి అన్నారు. సోమవారం మండ ల పరిధిలోని చీలపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశం, ఉపాధ్యాయులు ప్రసన్న, గోపి, తదితరులున్నారు.
సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్య
చేగుంట, జూన్ 5: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, పిల్లందరిని సర్కారు బడిలో చేర్పించాలని కర్నాల్పల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిట్టబోయిన సత్యనారాయణ, పోలంపల్లి హెచ్ఎం కర్రె సిద్దిరాములు అన్నారు. చేగుంటతో పాటు మండల పరిధిలోని కర్నాల్పల్లి, పోలంపల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యెన్నెలి నిర్మలాసత్యం, గణపురం సంతోష్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జగదీశ్, ఎస్ఎంసీ చైర్మన్లు, వార్డు సభ్యులు, చేగుంట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు రమేశ్, ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, సుమతి, యాదగిరి, శ్రీనివాస్, శృతి, రాధ, సత్యనారాయణ, వెంకటేశ్, సరస్వతి, నాగలక్ష్మి పాల్గొన్నారు.
డి.ధర్మారంలో..
రామాయంపేట రూరల్, జూన్ 5: రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమం చేపట్టారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన అందుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషాద్రి, ఉపాధ్యాయులు లత, శేఖర్, దీపిక, రాజశేఖర శర్మ పాల్గొన్నారు.