మెదక్, జూలై 7 (నమస్తే తెలంగాణ): జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. జీవో 58, 59, 76, 118 కింద భూ క్రమబద్ధీకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్పై సమీక్షించారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ జీవో 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తుల్లో 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదన్నారు. వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపు చేయాలని, లేని పక్షంలో భవన నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించాలని సూచించారు. జీవో 59 కింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసులు పంపించాలని, త్వరితగతిన చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వం తకువ ధరకు భూ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్ధిదారులు ముందుకొచ్చి చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2 జూన్ 2020కి పొడిగిస్తూ 58, 59,76 జీవోల కింద ప్రభుత్వం మరోమారు దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించేందుకు బృందాలు ఏర్పాటు చేసిందని, నెలరోజుల్లో క్షేత్రస్థాయి విచారణలో అర్హులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిషరించాలని కలెక్టర్లకు సూచించారు. భూ సమస్యల పరిషారం కోసం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ధరణి సేవలను విసృ్తతం చేయడంతో పాటు చిన్న, చిన్న లోపాలను సవరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు శ్రీనివాసులు, జయచంద్రారెడ్డి, డీఎఫ్వో రవి ప్రసాద్, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలి
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 7: జీవో 58, 59 దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ జీవో 58, 59, 76, 118 కింద క్రమబద్ధీకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్స్పై సమీక్షించారు. జీవో 59లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు నిర్ణీత పేమెంట్ను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లేకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. ధరణి కొత్త ఫీచర్స్ను ఈ సందర్భంగా వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు పంపిణీకి ఇండ్ల స్థలాలు సిద్ధం చేయాలి
– మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 59 కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు రూ.లక్ష లోపు, 10 లక్షలపై రుసుం కట్టాల్సిన వారికి నోటీసులు ఇచ్చి తక్షణమే వసూలు చేయాల్సిందిగా సూచించారు. పొడిగింపు తరువాత నూతనంగా జీవో 58 కింద వచ్చిన 1230 దరఖాస్తులు, జీవో 59 కింద వచ్చిన 897 దరఖాస్తులను జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన 21 సర్వే బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి, వివరాలను సంబంధిత యాప్లో నమోదు చేయాలని సూచించారు. సర్వే బృందాలు గ్రామాల్లో ఎకడెకడ ప్రభుత్వ భూములు, అటవీ భూములున్నాయో మ్యాపింగ్ చేసుకుని సరిహద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ధరణి కింద పెండింగులో ఉన్న 4,271 దరఖాస్తులను పరిషరించాల్సిందిగా సూచించారు.
మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పంపిణీకి స్థలాలు గుర్తించి లే అవుట్ సిద్ధం చేయాలని, పంచాయతీ తీర్మానాలకు ప్రాముఖ్యతనివ్వాలని తహసీల్దార్లకు సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల భర్తీకి చర్యలు తీసుకోవడంతో పాటు నూతనంగా ఏర్పాటు చేయాల్సిన వాటిపై నివేదిక అందజేయాలని సూచించారు. శనివారం నర్సాపూర్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పోడు పట్టాలు ఇచ్చేందుకు మండలాల వారీగా సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదేశించారు. మండలాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు వెంటనే స్ధలాలు గుర్తించి అప్పగించాల్సిందిగా ఆదేశించారు. హరిత హారంలో భాగంగా సంపద వనాల కింద 24 బ్లాకులను గుర్తించామన్నారు. మహిళా లబ్ధిదారుల పేర గృహలక్ష్మి కోసం కొత్త ఖాతాలు తెరిపించాలన్నారు. రెండు పడకల గదుల ఇండ్లకు సంబంధించి పెండింగ్ లబ్ధిదారుల వివరాలు అదజేయాల్సిందిగా కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా తహసీల్దార్లకు సూచించారు.
జీవో 58 దరఖాస్తులను పరిష్కరించాం
– సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ జీవో 58 దరఖాస్తులను పరిష్కరించామని నవీన్ మిట్టల్కు వివరించారు. అర్హులైన వారికి క్రమబద్ధీకరణ పట్టా సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. జీవో 59లో 471 దరఖాస్తులు రాగా, అందులో 313 మంది డబ్బులు చెల్లించి, రెగ్యులరైజ్ చేసుకున్నారన్నారు. 156 మంది పూర్తి స్థాయిలో పేమెంట్ చేయలేదన్నారు. అందులోనూ 33 మంది రూ.10 లక్షలకు పైగా డబ్బు చెల్లించాల్సి ఉన్నదన్నారు. సంబంధితులకు నోటీసులు జారీ చేశామని, త్వరితగతిన డబ్బు చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. 2023లో జీవో 58లో కొత్తగా 3,391 దరఖాస్తులు వచ్చాయని, జీవో 59లో 2597 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని వివరించారు. పెండింగ్ దరఖాస్తులు, కొత్త దరఖాస్తులన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ధరణిలోని వివిధ మాడ్యూల్స్లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,21,984 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,08,648 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. మిగతావి 15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.