అందోల్, ఫిబ్రవరి 19: అమ్మాయిల చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని, ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నా రు. సోమవారం సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి సందర్శించి కాలేజీ ప్రహరీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. మెడికల్, నర్సింగ్ కళాశాలతో పాటు 150 పడకల దవాఖాన నిర్మాణం కోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో వసతుల కల్పన కోసం నిధులు మంజూ రు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజల సౌల భ్యం కోసం నూతనంగా 150 పడకల దవాఖాన నిర్మిస్తున్నామని, మెడికల్, నర్సింగ్ కళా శాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని అందుకోసం నిరంతరం శ్రమించాలన్నారు. భవిష్యత్తులో అందోల్-జోగిపేటల్లో మరిన్ని విద్యాసంస్థలను నెలకొల్పి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత విద్య అందేలా కృషి చేస్తానన్నారు. అనంతరం డాకూర్ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పం చ్ పూజా, మాజీ ఎంపీటీసీ రమేశ్గౌడ్ తదితరులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఆర్డీవో పాండు తదితరులు పాల్గొన్నారు.
చౌటకూర్, ఫిబ్రవరి 19: విద్యార్జనతో సమాజంలో మార్పు సాధ్యమని, ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని వైద్యారోగ్య, శాస్త్రసాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. చౌటకూర్ మండలంలోని శివంపేట పాలిటెక్నిక్ కళాశాల, సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం రూ.4.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి శంకుస్థాపనలు చేశారు.