హవేళీఘనపూర్, ఫిబ్రవరి 20: గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు నిర్మాణం చేపట్టడం ద్వారా రవాణా సదుపాయం మెరుగుపడుతుందన్నారు. సోమవారం మండలంలోని శమ్నాపూర్ గ్రామంలో రూ. 10లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రాజరాజేశ్వరి దేవాలయం సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మండలంలో గతంలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హవేళీఘనపూర్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్ల కు నిధులు మంజూరు చేయించి రవాణా సదుపాయం మెరుగుపర్చమని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పాటు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించుకున్నామన్నారు. తద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి వచ్చి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కూతవేటు దూరంలో ఉన్న మెదక్కు వెళితే పనులు చేసుకోవచ్చన్నారు. గ్రామ సర్పంచ్ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజరాజేశ్వరి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకరిస్తానన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ. 2 లక్షల వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, గ్రామ సర్పంచ్ లింగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మెదక్ పీఎసీఎస్ డైరెక్టర్ సాప సాయిలు, గ్రామ సర్పంచులు యామిరెడ్డి, మంద శ్రీహరి, ఎంపీటీసీ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు సతీశ్రావు, రమేశ్, వెంకట్ పాల్గొన్నారు.