నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దోమాడుగు గ్రామానికి చెందిన మనిగండ్ల పోచమ్మ (45) ఆటోలో నర్సాపూర్వైపు వెళ్తుండగా.. వెనకాల నుంచి ఒక్కసారిగా డీసీఎం ఢీకొట్టడంతో పోచమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను దవాఖానకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందింది.
మేడిపల్లి పవిత్ర, బాలయ్య, ఎస్కే హైదర్లకు గాయాలు కాగా వారిని దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గంగరాజు తెలిపారు.