రేగోడ్,జూన్ 1: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వాడలో ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సంఘం భవనాన్ని అధికారులు, సర్పంచ్తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.12 లక్షలతో కమ్యూనిటీ భవనం, రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషకరమన్నారు. అర్హులైన పేదవారికి సొంతింటి కలనెరవేర్చడమే మా బాధ్యత అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింఘ్,ఆర్డీవో రమాదేవి,సర్పంచ్ సరోజినీకిషన్,డీఆర్డీవో పీడీ శ్రీనివాస్రావు,పంచాయతీరాజ్ ఈఈ నర్సింహులు,అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
మండలంలో గజ్వాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ప్రొటో కాల్కు సంబ ంధంలేని వ్యక్తుల ఫొటోలు దర్శనమిచ్చాయి.సమావేశానికి వచ్చిన ప్రజలు ఫ్లెక్సీని చూసి ఆశ్చర్యపోయారు.