రామయంపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తదళితుల అభివృద్ధికి దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టాడని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్ అన్నారు. బుధవారం తూప్రాన్ పట్టణంలోని మున్సిపల్తో పాటు మహనీయుల విగ్రహాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లా డుతూ. దళిత బంధు పథకాన్ని ప్రస్తుతం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారని అన్నారు.
రాబోయే రోజుల్లో ఈ పధకాన్ని అన్ని జిల్లాలో వర్తింపజేస్తాడని అన్నారు. నిరుపేద బలహీన వర్గాల అభివృద్దికి సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పించడమే సీఎం ఉద్దేశ్యమని అన్నారు. దళితబంధుతో దళితుల తలరాతలు మారుతాయని , మును పెన్నడూ లేనివిదంగా రైతు బంధు,రైతు బీమా, రుణ మాఫీ, షాదీముబారక్ తదితర పధకాలను ప్రవేశపెట్టి ప్రజాదరణ పొందుతున్నారని అన్నారు.
ఇది ఓర్వలే క కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నంధాల శ్రీనువాస్, కమిషనర్ మోహన్, జడ్పీటీసీ రాణి, కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్, ఉమాసత్య లింగం, శ్రీశైలంగౌడ్, రాజు, వెంకట్గౌడ్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.