జక్కన్నపేటలో 20మంది లబ్ధిదారుల ఎంపిక
పౌల్ట్రీ, పశువుల షెడ్డు పనులు ప్రారంభం
టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితుల అభినందనలు
హవేళీఘనపూర్, మే 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అధికారుల సమక్షంలో యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పించారు. దీంతో జక్కన్నపేట గ్రామంలో 20 మంది లబ్ధిదారుల్లో నలుగురు గేదెల పెంపకం, 4 కోళ్లఫారాలు, ఐదుగురు కిరాణం షాపులు ఏర్పాటు, ఒకరు ట్రాక్టర్, ఇద్దరు కలిపి హార్వెస్టర్, ఇద్దరు ట్రాలీ ఆటో(అశోక్లేలాండ్) ఇద్దరు యూనిట్లను ఎంపిక చేసుకున్నారు.
ఇందులో మొట్టమొదటిసారిగా అధిక మంది లబ్ధిదారులు ట్రాక్టర్లను ఎంపిక చేసుకోగా ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అందులో ఇద్దరు ట్రాక్టర్లను కొనుగోలు చేసుకునేలా అవగాహన కల్పించారు. లబ్ధిదారుల్లో ట్రాక్టర్లను ఎంచుకోవడంపై ఉన్న కొద్దిపాటి పొలంలో అధిక ట్రాక్టర్లు కొనుగోలు చేయడంతో ఎవరికి ఉపాధి అవకాశాలుండవన్న విషయంపై అవగాహన కల్పించడంతో ఇద్దరు మాత్రమే ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని నిర్ణయించుకున్నారు. దీంతో ట్రాక్టర్లకు ఉన్న పోటీ పూర్తిగా తగ్గిపోయింది. 20మంది లబ్ధిదారుల్లో ఇప్పటికే 18మందిని గుర్తించి యూనిట్లకు అవసరమైన వాటిని సమకూర్చుకుంటున్నారు. వ్యవసాయం పొలం వద్ద కోళ్ల ఫారాలకు ఇప్పటికే ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు. అలాగే గ్రామంలో గేదెల షెడ్డూకు కూడా పనులను ప్రారంభించారు. జక్కన్నపేట గ్రామాన్ని దళితబంధు ప్రాజెక్టుకు ఎంపిక చేయడంపై వారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధిని పెంచుకొని ఆదర్శంగా నిలువాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకొని తమకు తాము ఉపాధి అవకాశాలు పెం పొందించుకొని రాబోయే లబ్ధిదారులకు ఆదర్శంగా నిలువాలి. ఎంచుకున్న యూనిట్లను సక్రమంగా వినియోగించుకొని వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా అంద రూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– ఎంపీడీవో శ్రీరామ్
గ్రామ ఎంపిక హర్షణీయం
గత ఎన్నో ప్రభుత్వాలు దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా ఏవీ అమలుకు నోచుకోలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీఎం కేసీఆర్ దళితబంధుపథకం కింద ఒక్కొక్కరికి రూ. 10లక్షలు అందజేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించడం సంతోషకరమైన విషయం. ఇందుకు కృషి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– ఆంజనేయులు, దళితబంధు లబ్ధిదారుడు
మరింత విశ్వాసం పెరిగింది
పని కోసం వెతుకులాట ఉండకుండా దళితులే స్వయంగా ఉపాధి అవకాశాలు పెంచుకునే విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల బతుకల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసంను పెంచారు. అన్ని రంగాల్లో వెనుకబడిన తమను ప్రభుత్వం గుర్తించి ఉపా ధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ పథ కం ప్రవేశపెట్టడం అభినందనీయం. ప్రభు త్వం అందించిన ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాం.
– హన్మంతు, దళితబంధు లబ్ధిదారుడు