సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 19: రెండో విడత దళితబంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రెండో విడతలో లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ నిధులను ఫ్రీజ్ చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల కోడ్ ముగిసి మూడు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు డబ్బులను జమచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.