దుబ్బాక, మార్చి16: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఫలించింది. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని బల్వంతాపూర్-మల్లాయిపల్లి శివారులో 4 ఎల్ డిస్ట్రిబ్యూషన్ ఉపకాల్వల నుంచి ఆయన సాగునీరు విడుదల చేశారు. ఉపకాల్వల ద్వారాఎనిమిది గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్డ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని 4ఎల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 15 కిలోమీటర్ల పొడవు ఉపకాల్వ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, సోలిపేట సతీశ్రెడ్డి, ఎల్లారెడ్డి, భూంరెడ్డి, కొత్త కిషన్రెడ్డి, బనాల శ్రీనివాస్, మూర్తి శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.