హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలలో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న మోస్తరు తీవ్రతగల ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో 94 శాతం కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
జూలై లో దేశవ్యాప్తంగా దాదాపు సాధారణ వర్షపాతం నమోదైం ది. రుతుపవనాల రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తకువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేరొంది. అయితే హిందూ మహాసముద్రం నుంచి రుతుపవనాలకు కొంత సానుకూల ప్రభావం లభించే అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.