చిన్నశంకరంపేట, మార్చి 15: భానుడి తాపానికి బోరుబావులు వట్టిపోయాయి. పంట పొలాలకు నీరు లేకపోవడంతో కొందరు రైతులు వరిపంటను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. చిన్నశంకరంపేటకు చెందిన రైతు చాకలి నవీన్ తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నాడు. వారం రోజులుగా బోరులో నీరు రావడం లేదు. వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉంది.
మరో ఇరవై రోజులైతే పంట చేతికి వస్తుందని రైతు తెలిపారు. పంట ఎండిపోతుంటే చూడలేక ట్యాంకర్ ద్వారా పొలానికి నీరు పడుతున్నాడు. రోజుకు 8ట్యాంకర్ల నీరు పెడుతున్నానని, ఒక్కో ట్యాంకర్ ధర రూ.600 అవుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పదేండ్లలో బోరుబావి ఎండిపోవడం ఇదే మొదటిసారి అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.