సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 9: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. 35వ జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను (గోల్డెన్ అవర్) గంటలోపు దగ్గరలో ఉన్న దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడాలన్నారు.
ప్రమాదాల నివారణ గురించి 66 గ్రామాల్లో 462 మంది రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులను నియమించామన్నారు. మానవ జీవితం చాలా విలువైందని.. కార ణం లేని మరణం రోడ్డు ప్రమాదం మాత్రమే అన్నా రు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రసన్నకుమార్, ఏసీపీ సురేందర్రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది, రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, హెచ్కేఆర్, ఆర్అండ్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.