కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. శనివారం రామాయంపేట మండలం లాక్యాతండా, పర్వతాపూర్, దామరచెర్వు, రాయిలాపూర్, చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, చందాపూర్, మల్లుపల్లి, రుద్రారం, చందంపేట, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
చిన్నశంకరంపేట/రామాయంపేట రూరల్, నవంబర్ 11: రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని, ఆ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మ మోసపోవద్దని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, చందాపూర్, మల్లుపల్లి, రుద్రారం, చందంపేట, రామాయంపేట మండలంలోని లాక్యాతండా, పర్వతాపూర్, దామరచెర్వు,రాయిలాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పద్మాదేవేందర్రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బోనాలు, బతుకమ్మలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. చందంపూర్లో బోనాలు, బతుకమ్మలు పోతరాజులతో డప్పుచప్పుళ్లు, డొల్ల వాయిద్యాలతో పటాకులు కాలుస్తూ, పూలవర్షం కురిపించారు. రుద్రారం పెద్దమ్మ ఆలయం, చందంపేటలోని శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ 24గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్నా కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలన్నారు. 11 సార్లు కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో రైతులు కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారని గుర్తుచేశారు.
ప్రస్తుతం రైతులకు ఆ పరిస్థితి లేదన్నారు రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటును ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు మెదక్ ప్రజలకు ఏమి చేశారన్నారు. 13 ఏండ్ల నుంచి మెదక్ ప్రజలకు దూరం ఉండి ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడిగితే ఎలా వేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3000 అందించనున్నట్లు తెలిపారు. రూ.400కు గ్యాస్ సిలిండర్ను అందిస్తారన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారలో మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
ఏకే గంగాధర్రావు, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గం ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నాయకుడు నందు జనార్దన్రెడ్డి, జడ్పీటీసీ పట్లోరి మాధవి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు, పీహెచ్ రమణ, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్లు బందెళ్ల జ్యోతి, పడాల రమాదేవి, లక్ష్మణ్, శ్రీలత, సింగిల్విండో చైర్మన్లు అంజిరెడ్డి, సత్యనారాయణ, నాయకులు కుమార్గౌడ్, రమేశ్, మైనంపల్లి రాధాకిషన్రావు, రమేశ్రావు, వెంకటేశం, లక్ష్మణ్, నాగరాజు, గణేశ్, ఉప్పరి శ్రీను, లింగారెడ్డి, ప్రభాకర్, హేమచంద్రం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు ఆపాలని కుట్ర చేస్తున్నదన్నారు. ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రైతులకు మంచి రోజులు వచ్చాయని, దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని వ్యక్తిని గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గతంలో పల్లెలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నయి ఇది చూసి ఓటేయాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత పల్లెలు ఎంతో ప్రగతి పథంలో వెళ్తున్నాయని, సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ అవుతున్నదన్నారు. రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రశాంతంగా ఉన్న మెదక్ను కొట్లాటలకు అడ్డగా మార్చే కుట్రలు చేయడం మానుకోవాలన్నారు. ఆమె వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు బోయిని దయాలక్ష్మీ స్వామి, సుభాష్ రాథోడ్, పడాల శివప్రసాదరావు, నర్సాగౌడ్, మైలారం శ్యాములు, ఆర్కే మల్లేశం, ఎంపీటీసీలు పాకాల శ్రీలత చంద్రశేఖర్రావు, సార్గు భాగ్యమ్మ, రామాయంపేట జడ్పీటీసీ జేరిపోతుల సంధ్య, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బండారి మహేందర్రెడ్డి, గజవాడ నాగరాజు, ఎంపీపీలు భిక్షపతి, దేశెట్టి సిద్దిరాములు, వైస్ ఎంపీపీ స్రవంతి సిద్దిరాంరెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ సర్పంచ్లు పాకాల రామారావు, పిట్ల యాదగిరి తదితరులు ఉన్నారు.