Subhash Reddy | మెదక్ అర్బన్, జూన్ 20 : మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్ కు పెద్ద మొత్తంలో ప్రభుత్వం ముడుపులు అందించడం హేయమైన చర్య అని, ఈ ప్రభుత్వం యూరియా యాప్ను వెంటనే ఎత్తివేయాలని, ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మండిపడ్డారు. మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని మరొకసారి గుర్తు చేశారు. హైదరాబాద్లో మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్కు రూ.700 కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం అన్నారు.
పరిపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సుభాష్ రెడ్డి అన్నారు. వ్యవసాయదారునికి యూరియా యాప్ వల్ల కష్టాలు ఎదురవుతున్నాయని.. అది పూర్తిగా తీసేసే వరకు గ్రామాలలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పరిపాలనలో 7500 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తీసుకుంటూనే వడ్లు లేదంటే మా వల్ల కాదు అది చెప్పడం దేనికి సంకేతమని సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. మిగిలిన వరి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల పట్ల నిజాయితీ చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, బట్టి జగపతి, మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, కృష్ణారెడ్డి, జుబేర్, అంజా గౌడ్, కిష్టయ్య, సాప సాయిలు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.