మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, దర్పల్లి, శేరిపల్లి ఎంపీటీసీలతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బుధవారం మెదక్లో వీరందరికీ ఆమె గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నియోజక అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరుతున్న ప్రతిఒక్కరికీ తగిన ప్రాధాన్యమిస్తామన్నారు.
-మెదక్ (నమస్తే తెలంగాణ) అక్టోబర్ 11
మెదక్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు మద్దతు పలుకుతున్నారు. బుధవారం కాంగ్రెస్కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలతోపాటు 250 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. చిన్నశంకరంపేట మండలపరిధిలోని మిర్జాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సకుబాయి మున్యానాయక్, ధర్ప ల్లి ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మాఆంజనేయులు, శేరిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సంతోషగొండస్వామితోపాటు కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేశారు.
వారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మక్క బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ మండలాలకు చెందిన మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పద్మక నీ గెలుపు పక్కా.. మీకు అండగా మేమున్నాం. అంటూ నినాదాలు చేశా రు. నియోజకవర్గ ప్రజలంతా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు రాజు, నాయకులు పోతరాజు రమణ తదితరుపాల్గొన్నారు.