న్యూఢిల్లీ: దేశం కోసం రెండు గంటలు (2 ఘంటే దేశ్ కే నామ్) అనే ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ ఢిల్లీవ్యాప్తంగా పలువురు వైద్య నిపుణులు ముందుకు వస్తున్నారు. పేద, నిరుపేద వర్గాలకు చెందిన రోగులకు ప్రతి వారం రెండు గంటల ఉచిత కన్సల్టేషన్ సేవలు అందించనున్నట్టు శనివారం ప్రకటించారు.
కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ సహా ఇతర స్పెషలిస్ట్లు క్రమంగా దీంట్లో నమోదు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని రోగుల కోసం వర్చువల్ కన్సల్టేషన్ స్లాట్లను కూడా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు..వైద్య నిపుణుల సేవలు అందిస్తామని డాక్టర్ ఇకేదా తెలిపారు.