చిలిపిచెడ్, మే 2: ప్రజలకు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటి అమలు విషయంలో ఊసెత్తడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ అందించడం లేదన్నారు. గురువారం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మద్దతుగా చిలిపిచెడ్ మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిలిపిచెడ్ మండలంలోని రాందాస్ గూడలో సీతారామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సోమక్కపేట, సామ్ల్యా తండా, రహీంగూడ, శీలాంపల్లి, ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి,గంగారం, జగ్గంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచలేదని, మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఇవ్వలేదని, రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు సాయం అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని,ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని అన్నారు.
రహీంగూడ తండాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. కార్యక్రమంలో చిలిపిచెడ్ బీఆర్ఎస్ మండల ఇన్చార్జి, జడ్పీ కో అప్షన్ సభ్యుడు మన్సూర్,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉపాధ్యక్షులు బెస్త లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి,రాంచంద్రారెడ్డి,బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మీనాప్రసున్న, నాయకులు రాజిరెడ్డి, కిషన్రెడ్డి, దుర్గారెడ్డి, మాణిక్యరెడ్డి, వీరాస్వామి, యాదాగౌడ్, మధుసూదన్రెడ్డి, గోపాల్రెడ్డి, యాదగిరి, భిక్షపతి, వెంకట్రెడ్డి, విఠల్, భీమయ్య, శంకరయ్య, అంబర్సింగ్, మనోహర నర్సింహరెడ్డి, షఫీమొద్దీన్, సయ్యద్ ఉస్సేన్, ఇస్తారి పాల్గొన్నారు.