ప్రమాదాల నివారణకు,వాహనదారులను అప్రమత్తం చేయడానికి రహదారి పక్కన సూచికలు,బోర్డులు అధికారులు ఏర్పాటు చేస్తారు.వీటి ద్వారా ముందు రహదారి పరిస్థితి, వేగ పరిమితి తెలుసుకొనే వీలుంటుంది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో నర్సాపూర్-జోగిపేట రహదారిపై చండూర్ చౌరస్తాకు, శీలాంపల్లి వద్ద,ఫైజాబాద్ శివారులోని గిరిజన తండా వద్ద,
గంగారం గ్రామానికి వెళ్లి దారిలో,గౌతాపూర్,రాందాస్ గూడలో చెట్టు ఎక్కిన సూచికల నిర్వహణపై ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. రహదారుల వైపు చాలా సూచికలు పక్కకు పడిపోయి,వంగి, చెట్ల పొదల్లో కనిపించకుండా ఉన్నాయి.మలుపులు,కల్వర్టుల గురించి కొత్తగా వచ్చే వాహనదారులకు తెలియక ప్రమాద్రాలకు గురవుతున్నారు. ఆర్అండ్బీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు సరి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -చిలిపిచెడ్,జూన్ 6