తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దొరలు, భూస్వాములు రైతులపై చేస్తున్న దౌర్జన్యానికి ఎదురునిలిచి, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. నేటి యువత కొమురయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
-సంగారెడ్డి/మెదక్, న్యూస్నెట్వర్క్, జూలై 4
సంగారెడ్డి కలెక్టరేట్/ సంగారెడ్డి, జూలై 4 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధిద్దామని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించారు. ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించా రు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. నిజాం తెలంగాణలో రైతులపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించి పోరాడి అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహనీయులను గౌరవించుకుంటున్నామని అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య మరణంతో తెలంగాణ రైతాంగ ఉద్యమం సాయుధ విప్లవోద్య మంగా కొనసాగిందన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన మహనీయుడు కొమురయ్య అని కొనియాడారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణలో దొరలు, భూస్వాముల దౌర్జన్యానికి ఎదురునిలిచి ప్రాణాలను ఆర్పించారన్నారు. తెలంగాణ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం మహనీయుల స్ఫూర్తితోనే వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీశ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షీసాయికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణి క్యం, ఆర్డీవో రవీందర్రెడ్డి, డీఎస్పీ రవీందర్రెడ్డి, కురుమ సం ఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్, బీసీ సంఘం జాతీ య ప్రధాన కార్యదర్శి బీరయ్య, నేతలు కొల్కూరి ప్రవీణ్, తాటిపల్లి పాండు, డాక్టర్ శ్రీహరి, నవాబుగారి భూమయ్య, ఉత్తర్పల్లి మాణయ్య, ప్రదీప్, మల్లేశం, నగేశ్ పాల్గొన్నారు.