సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 4 : హరితహారంలో భాగంగా సంపద వనాల ఏర్పాటుపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులకు సంగా రెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 100శాతం హరితహారం లక్ష్యాన్ని సాధించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా, చెరువులు, కాల్వ గట్లు, అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటేలా ఈజీఎస్లో వంద శాతం గుంతలు తవ్వించాలని సూచించారు. లేబర్ మొబిలైజేషన్ ఎక్కువగా ఉండాలన్నారు. అవెన్యూప్లాంటేషన్పై దృష్టి పెట్టాలని, పల్లె ప్రకృతి వనం ఖాళీ స్థలాల్లో కొత్త మొక్కలు నాటాలన్నారు. క్రీడా ప్రాం గణం, వైకుంఠధామం, డంపింగ్యార్డు చుట్టూ బయోఫెన్సింగ్ వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంచాయతీ నుంచి జిల్లాస్థాయి కార్యాలయ ఆవరణల్లో భారీ సంఖ్యలో మొక్కలను నాటాలన్నారు. ప్రతి ఇంటికీ ఎన్ని మొక్కలు ఇచ్చాం? ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం ఇచ్చిన మొక్కల వివరాలు? ఇతర రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
దశాబ్ది వనాలపై దృష్టి సారించాలి
జిల్లాలో సంపద వనాలు (దశాబ్ది వనాలు) ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పోడు భూముల లబ్ధ్దిదారులకు పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏఈవోలు నిల్వలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎంఆర్లో కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలపై చర్చించారు. జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం నిల్వలు, రైస్ మిల్లింగ్ పరిశీలించాలని, అందుబాటులో ఉన్న ధాన్యం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఇవ్వాలన్నారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయంపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల దరఖాస్తులను ఆన్లైన్లో పంపించాలన్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మా ణాలపై వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని ఎంపీడీవోలు, ఎంపీవోలను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహరావు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.