మెదక్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : నూతన పద్ధతులు అలవర్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో బుధవారం ఆయన అగ్రిటెక్ సౌత్ 20 24 పోస్టర్ను ఆవిషరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ …ఈ నెల 16 నుంచి 18వతేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రిటెక్ సౌ త్ – 2024 ఎగ్జిబిషన్, సదస్సు నిర్వహిస్తున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు వాటి పెంపకం, పునరుత్పత్తి వ్యవసాయం, పశుసంరక్షణ, చేపలు, కోళ్ల పెంపకం, ఆయిల్పామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, పోషక భద్రత, ఉద్యాన పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు, అగ్రి స్టార్టప్ల గురించి చర్చిస్తారన్నారు.
వివిధ వ్యవసాయ ఉపకరణాలపై 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రసాయనాలు, వ్యవసాయ పరికరాలు, పాడి పరిశ్రమ, మత్స్యపరిశ్రమ, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయంలో డిజిటల్ సాంకేతిక అంశాలపై రెండు రోజులు కాన్ఫరెన్స్లు ఉంటాయన్నారు. మెదక్ జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, వ్యవసాయ సహాయ సంచాలకులు వినయ్కుమార్, రాజ్నారాయణ పాల్గొన్నారు.