Dasoju Sravan | రాయదుర్గంలో జరుగుతున్న ఈ భూ దోపిడీని అడ్డుకుని తీరుతాము.. దీని మీద మేము గవర్నర్, సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. బుధవారం రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రాయదుర్గంలో రూ.1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి పీఎం ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో తన బినామీ సంస్థలకు ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఎంత పెద్ద నేరస్థుడో ఆయనకి కొమ్ము కాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్థులు. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ రూ.200 కోట్లు లోన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ వాళ్లకు కళ్లే కనబడటం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీని నడుపుతున్నది ఐఏఎస్ జయేష్ రంజన్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి అని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు దొంగ అగ్రిమెంట్లు, టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు పందికొక్కుల లాగా దోచుకుని తింటాము అంటే కర్రు కాల్చి అధికారులకు కూడా వాతలు పెడతామన్నారు.
రేవంత్ రెడ్డి బినామీ కంపెనీని నడుపుతున్నది ఐఏఎస్ జయేష్ రంజన్, IFS ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి
రాయదుర్గంలో రూ.1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని పీఎం ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో తన బినామీ సంస్థలకు ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టిన రేవంత్ రెడ్డి
రాయదుర్గంలో జరుగుతున్న ఈ భూ… https://t.co/VIo73pO85u pic.twitter.com/93uAvKWgsN
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026