మనోహరాబాద్, మార్చి 28: పీహెచ్సీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య మహిళా క్లినిక్, పీహెచ్సీలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా ఏర్పడిన మనోహరాబాద్ మండల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించేందుకు రూ. 2 కోట్లతో అత్యాధునిక వసతులతో పీహెచ్సీని నిర్మిస్తున్నామన్నారు. రాష్ర్టావతరణ దినోత్సవం నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మనోహరాబాద్లోని పీహెచ్సీ, ఆరోగ్య మహిళా క్లినిక్ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందు నాయక్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో యాదగిరి, సీఎం కేసీఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ చిట్కుల మహిపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, డైరెక్టర్ జావీద్పాషా, ఆత్మకమిటీ డైరెక్టర్ రేణుకామహేందర్, ఉప సర్పంచ్ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలు నివారించాలి
మెదక్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): అగ్నిప్రమాదాల నివారణకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీనిని నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అగ్ని ప్రమాదాల నివారణ, వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, చిన్న శంకరంపేట్, శివ్వంపేట వంటి మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. సమావేశంలో అగ్నిమాపక అధికారి గౌతమ్, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రాధాకిషన్, ఏడీ మైన్స్ జయరాజ్, ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మీ కుమారి, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, ఆర్డీవో సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
పోషకహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
మెదక్ రూరల్, మార్చి 28: చిన్నతనంలోనే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను గమనించి సమతుల్యమైన ఆహారాన్ని అందించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజన్ని నిర్మించిన వారమవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ నెల 20నుండి ఏప్రిల్ 3వరకు నిర్వహిస్తున్న పోషణ అభియాన్ -పోషణ్ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోఆడిటోరియం హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జ్వోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల స్టాల్ను పరిశీలించారు చిన్న పిల్లలతో అక్షరాభాస్యం, అన్న ప్రాసన చేయించి పోషణ్ అభియాన్ పోషణ పక్షం గోడప్రతికను ఆవిష్కరన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లా మహిళా సంక్షేమా అధికారి బ్రహ్మజీ, మెప్మాప్రాజెక్టు డైరక్టర్ ఇందిరా, డీఈవో రాధకిషన్ డీఎస్వో శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ కమలకర్ సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.