న్యూఢిల్లీ : యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆదివారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒక యువకుడు డ్రగ్స్కు అలవాటు అయితే అతని వ్యక్తిగత జీవితానికే కాకుండా.. సమాజానికే హానికరం అని చెప్పారు.
భారత్పై శత్రు దేశాల కుట్రలో భాగమే డ్రగ్స్ సరఫరా అన్నారు. భారత్ను నాశనం చేయడానికి డ్రగ్స్ సరఫరా చేసి ఇక్కడ యువతను మత్తులోకి దించుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. నషాముక్త్ యువ కార్యక్రమం కోసం కోటి మందికి పైగా బాధ్యతగల యువత ముందుకు వచ్చారని.. వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.