Edupayala | పాపన్నపేట, జులై 20 : ఆషాడమాసం నాల్గవ చివరి ఆదివారం పురస్కరించుకొని ఏడుపాయల దుర్గ భవాని మాతను రకరకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక రీతిలో చూపరులను ఆకర్షించే విధంగా అలంకరించారు. ఆషాడ మాసం పురస్కరించుకుని ఏడుపాయల దుర్గ భవాని క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యాం, బ్రహ్మచారి, బత్తినిరాజు, నర్సింలు, వరుణాచారి, నరేష్ యాదగిరి మహేష్, దీపక్, తదితరులు ఏర్పాటు చేయగా.. వేదపండితులు శంకర శర్మ, పార్థీవ శర్మ ,రాము , శేఖర్ నాగరాజు తదితరులు పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బందో బస్త్ చర్యలు చేపట్టారు.
కుటుంబ సభ్యులతో దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…
ఏడుపాయల దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి పేర ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి