చిలిపిచెడ్ (కొల్చారం), మార్చి 21: ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్యసేవలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వేసవి దృష్ట్యా దవాఖానలో తక్షణ వైద్యసేవలు అందించాలన్నారు. ఏఎన్ఎం, ఆశ వర్కర్లు సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వైద్యసేవలు అందించాలని సూచించారు.
మండలంలోని సంగాయ్యపేట తండాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, కొల్చారం తహసీల్దార్ గఫీర్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వందశాతం పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.