సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 15: సంగారెడ్డి జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని 100 శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషన ర్లు, ఇతర అధికారులతో హరితహారం పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను హరి త జిల్లాగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. భావితరాలకు స్వచ్ఛ వాయువులను అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ సంవత్సరం జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలు, నాటిన మొక్క ల వివరాలను ఆరా తీశారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలన్నారు. ప్రతి హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో వెయ్యి మొక్కల చొప్పున నాటాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత సంక్షేమ అధికారులు, ఆర్సీవోలకు సూచించారు. ప్రభుత్వ భవనాల్లోని అన్ని శాఖల్లో 100 శాతం మొక్కలు నాటాలని ఆదేశించారు.
మున్సిపాలిటీలోని పబ్లిక్ ఇనిస్టిట్యూషన్, స్థలాల్లో మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్లు, లేఅవుట్స్ ఉన్న అన్ని చోట్ల మొక్కలు పెట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. అన్ని గ్రామ పంచాయతీల్లోని రోడ్లకు ఇరువైపులా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్కు చర్యలు చేపట్టాలని డీపీవో, డీఆర్డీవోకు సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలు సమన్వయంతో అవెన్యూ ప్లాంటేషన్ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాసరావు, ఎన్హెచ్ఏఐపీడీ రాజేశ్, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.