Collector Dr. Sarath : సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 3 : రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 6న మంత్రి హరీశ్రావు జిల్లా కేంద్రంతో పాటు పటాన్చెరు, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వివరించారు. ఆయా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్వో, డీపీవో, మెడికల్ కళాశాల, తారా ప్రభు త్వ కళాశాల, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్, దవాఖానల సమన్వయకర్త, మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు.