చిన్నశంకరంపేట, జనవరి 26: చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మడూరులో రూ.20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. మడూర్ సహకార సంఘం సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్పీ పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
విద్యార్థులతో కలసి నృత్యం చేసి బహుమతులు అందజేశారు. మన ఊరు మనబడి పనులను పరిశీలించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు, పండిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తూ, రైతులకు అండగా ఉన్నారన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఆసరా పథకంలో 52,000 మందికి పింఛన్లు అందిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, ఇన్చార్జి తహసీల్దార్ మహేందర్గౌడ్, పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచ్ నరసమ్మ, ఎంపీటీసీ విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.