కొండపాక, నవంబర్ 28 : దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా రు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కుకునూర్పల్లి మండల ఏర్పాటులో భాగంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి కుకునూర్పల్లి నూతన రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అంతకుముందు వేదపండితుల ఆశీర్వచనాన్ని తీసుకున్న మంత్రి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. 30 ఏండ్ల కలను నెరవేరుస్తూ కొండపాక గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ15 గ్రామ పంచాయతీలతో, 20వేల జనాభాతో నూతన మండలాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారన్నారు.
కుకునూరుపల్లిలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తున్నదని, బతుకమ్మ, దసరా రెండు కలిపి ఒకేసారి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంతటి సంతోషం ఇక్కడి ప్రజల్లో కనబడుతుందన్నారు. మరో ఆరు నెలల్లో కుకునూర్పల్లికి రైలు సౌకర్యం కూడా రాబోతుందన్నారు. ఓ వైపు ప్రాజెక్టులు, మరోవైపు రాజీవ్ రహదారి, రైల్వే ఇలా అన్ని రంగాల్లో కుకునూరుపల్లి మండలం అభివృద్ధిలో ఆదర్శంగా నిలువబోతుందన్నారు. మిషన్ భగీరథతో తాగునీరు, కాళేశ్వరంతో సాగునీరు సమస్యలను తీర్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో సంక్షేమాన్ని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలతో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. పెద్దలు చెప్పినట్లుగా సద్ది తిన్నరేవును తలవాలే అన్నట్లు సీఎం కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజలంతా వెన్నంటి ఉంటున్నారన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అభ్యర్థన మేరకు కుకునూరుపల్లి మండలానికి ఇంటిగ్రెటేడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ భవనాన్ని మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ పోల్కంపల్లి జయంతీనరేందర్, ఎంపీపీ ర్యాగళ్ల సుగుణాదుర్గయ్య, జడ్పీటీసీ అనంతుల అశ్వినీప్రశాంత్, వైస్ ఎంపీపీ, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, ఎంపీటీసీ భూములుగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్ష్కీరెడ్డి ప్రభాకర్రెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణారవీందర్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ ర్యాగళ్ల దుర్గయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, జగదేవ్పూర్ జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.