కొండపోచమ్మ ప్రాజెక్టుతో గ్రామగ్రామాన పసిడి పంటలు
మత్స్యసంపదతో మరిన్ని ఉపాధి అవకాశాలు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
వర్ధరాజస్వామి రథోత్సవానికి హాజరు
అనంతరం కొండపోచమ్మ ప్రాజెక్టు సందర్శన
మర్కూక్,మే18: ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డిలకు స్వామివారి శేష వస్ర్తాలను కప్పి ఆశీర్వదించారు. అనంతరం వారు మర్కూక్లోని కొండపోచమ్మ రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ యాదాద్రిని అద్భుతంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. అదే విధంగా వర్ధరాజ్పూర్ వర్ధరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి రూ.10కోట్లు కేటాయించడం సంతోషకరమైన విషయమన్నారు. ఇప్పటి వరకు ఈ ఆలయాభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదని,సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆలయానికి పూర్వవైభవం రానున్నదన్నారు.
రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధి పను లు కొనసాగుతున్నాయన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్తో గజ్వేల్ ప్రాంత పంట భూముల దాహం తీరిందని, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పంటలకు అవసరమైన సమయంలో విడుదల చేసిన సాగుజలాలతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో అద్భుతమైన పంటలు పండాయన్నారు. గ్రామాలన్నీ పచ్చటి ధాన్యంతో పసిడి శోభను సంతరించుకున్నాయన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా చెరువులు, కుంటల్లోకి పుష్కలంగా నీటిని విడుదల చేయడంతో ఏడాది పొడవునా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో మత్స్య సంపద పెరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అప్పాల ప్రవీణ్ కుమార్, జడ్పీటీసీ మంగ మ్మా రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు లక్కాకుల సాహిత, గజ్వేల్ ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణాశ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య, నాచారం ఆలయ చైర్మన్ హరిపంతులు, నాయకులు ప్రవీణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణయాదవ్, సర్పంచ్లు భాస్కర్, అప్పాల స్వరూపామల్లేశం, తుమ్మకృష్ణ, మొర్పు శ్రీనివాస్రెడ్డి, పాపోల్ల రాజు, ర్యాకం స్వామి పాల్గొన్నారు.